BREAKING: తెలంగాణ సెక్రటేరియట్‌పై డ్రోన్ కలకలం.. పోలీసుల అదుపులో ఇద్దరు

by Ramesh N |
BREAKING: తెలంగాణ సెక్రటేరియట్‌పై డ్రోన్ కలకలం.. పోలీసుల అదుపులో ఇద్దరు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం (Telangana Secretariat)పై డ్రోన్ కలకలం రేపింది. ఈ నెల 11న రాత్రి ఇద్దరు ఆగంతకులు డ్రోన్ ఎగరవేసినట్లు (Drone Flew Over Secretariat) సెక్రటేరియట్ అధికారులు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రోన్ ఎగరేసిన ఇద్దరినీ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వంశీ, నాగరాజు అనే ఇద్దరినీ సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరాతో సెక్రటేరియట్ అవుట్ పోస్ట్, లాన్ ఏరియా నిందితులు చిత్రీకరించినట్లు సమాచారం. వారి నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story